దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్( IPL 2021 )లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టాడు. ఐపీఎల్ ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్గా హర్షల్ రికార్డు సృష్టించాడు. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన హర్షల్ ఈ రికార్డు అందుకున్నాడు. విలియమ్సన్, సాహా, హోల్డర్ వికెట్లు తీసిన హర్షల్.. ఈ క్రమంలో బుమ్రా 27 వికెట్ల రికార్డును దాటాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ వికెట్ల సంఖ్య 29కి చేరింది.
లీగ్ దశలో మరో మ్యాచ్తోపాటు బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావడంతో హర్షల్కు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దీంతో ఈ వికెట్ల సంఖ్య మరింత పెరగనుంది. గత వారమే ఐపీఎల్లో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ అత్యధిక వికెట్లను హర్షల్ అధిగమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ హర్షల్కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అతని తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ బౌలర్ అవేష్ ఖాన్ 22 వికెట్లతో ఉన్నాడు. అతని ప్రదర్శన చూసిన ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్ హర్షాభోగ్లే.. హర్షల్ను టీ20 వరల్డ్కప్కు ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
If the pitches at the #ICCT20WorldCup2021 are going to be similar to these, picking Harshal Patel might not be a bad idea. (Changes allowed till October 10!). A horses-for-courses practical selection. What do you guys think?
— Harsha Bhogle (@bhogleharsha) October 6, 2021