IPL 2024 MI vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో కీలక మ్యాచ్కు కౌంట్డౌన్ మొదలైంది. ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians).. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) అమీతుమీకి సిద్దమవుతున్నాయి.
టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్ చిచ్చరపిడుగు విల్ జాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహమ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ ఆకాశ్ మద్వాల్,
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), మహిపాల్ లొమ్రోర్, రీసే టాప్లే, విజయ్కుమార్, సిరాజ్, ఆకాశ్ దీప్.
Will Jacks Play Button ✅#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #MIvRCB @Wjacks9 pic.twitter.com/RmkMdsVjDw
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 11, 2024
ఈ ఎడిషన్లో ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై రెండో విజయంపై గురి పెట్టింది. మరోవైపు హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన ఆర్సీబీ గెలుపు తలుపు తట్టాలనే పట్టుదలతో ఉంది. సొంత మైదానంలో ఢిల్లీకి చుక్కలు చూపించిన ముంబైని డూప్లెసిస్ సేన నిలువరిస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఈ మెగా టోర్నీలో ముంబై, ఆర్సీబీలు 32 సార్లు తలపడ్డాయి. ముంబై 18 విజయాలు సాధించగా.. బెంగళూరు 14 మ్యాచుల్లో గెలిచి 18 సార్లు ఓటమి చవిచూసింది. అయితే.. ఇరుజట్లలో అత్యధిక స్కోర్ కొట్టింది మాత్రం ఆర్సీబీనే. బెంగళూరు జట్టు 235 పరుగులు చేయగా.. ముంబై మాత్రం ప్రత్యర్థిపై 213 రన్స్తో చేసింది. హిట్టర్లతో నిండిన ఈ రెండు జట్లలో అత్యల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఒక మ్యాచ్లో ముంబై 111 పరుగులకే పరిమితమవ్వగా.. ఆర్సీబీ సైతం అతికష్టం మీద 122 రన్స్ కొట్టింది. పదహారో సీజన్లో ముంబై, ఆర్సీబీలు రెండు సార్లు ఎదురుపడ్డాయి. అయితే.. తొలి మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలవగా.. రెండో పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.