హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. తాజాగా మెన్స్ 4×400 మీటర్స్ రిలేలో బంగారు పతకం దక్కింది. దాంతో పసిడి పతకాల సంఖ్య 18కి చేరింది.
అదేవిధంగా ఉమెన్స్ 4×400 మీటర్స్ రిలేలో కూడా భారత్కు రజతం దక్కింది. ఇక 35 కిలోమీటర్ల రేసు వాక్ మిక్స్డ్ టీమ్స్ ఫైనల్లో భారత్ కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రజత పతకం నెగ్గాడు.