టొరంటో: ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన పదో రౌండ్లో బరిలో దిగిన గుకేశ్..రష్యా జీఎం ఇయాన్ నెపోనియాచితో జరిగిన గేమ్ను డ్రా చేసుకున్నాడు. విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ కూడా డ్రాగా ముగిసింది.
మరో నాలుగు రౌండ్లు మిగిలున్న టోర్నీలో ఆరేసి పాయింట్లతో గుకేశ్, నెపోనియాచి టాప్లో కొనసాగుతున్నారు.సలీమోవా చేతిలో వైశాలి ఓడగా, హంపి డ్రా చేసుకుంది.