న్యూఢిల్లీ : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో వచ్చే సీజన్కు ముంబై ఇండియన్స్ జట్టును చేరనున్నాడు. గుజరాత్ టైటాన్స్ రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలో అతని పేరు ఉన్నప్పటికీ డిసెంబర్ 12వరకు ట్రేడింగ్ జరుగనుండడంతో హార్దిక్ ముంబైకి మారనున్నాడన్న వదంతులకు బలం చేకూరుతోంది.
కాగా మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరుగనున్నది. 2015లో ముంబై ఇండియన్స్తో ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన హార్దిక్ నాలుగుసార్లు టైటిల్ సాధనలో పాలుపంచుకున్నాడు. అనంతరం 2022లో గుజరాత్ టైటాన్స్కు మారి ఆ జట్టు కెప్టెన్గా టైటిల్ సాధించిపెట్టాడు. గత యేడాది గుజరాత్ జట్టు రన్నరప్గా నిలిచింది. వేలం ముగిసేసరికి హార్దిక్ గుజరాత్తోనే ఉంటాడా.. లేక ముంబైకి మారుతాడా ఆన్నది వేచిచూడాలి.