హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై మరో తెలంగాణ ఫెన్సర్ తళుక్కుమంది. థాయ్లాండ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ మినీ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన గూడూరు బృహతి వర్మ కాంస్య పతకంతో మెరిసింది.
అండర్-10, 12 కేటగిరీ సెబర్ విభాగంలో ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన బృహతి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. అంచనాలకు అనుగుణంగా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా టోర్నీలో బృహతి రాణించిందని ఆమె తండ్రి శరత్ వర్మ పేర్కొన్నారు.