దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలోనే కోల్కతా వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఫైనల్లో బెర్తు ఖాయం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే గత మ్యాచ్లో గాయపడిన ఓపెనర్ వృద్ధిమాన్ సాహా పూర్తి ఫిట్గా ఉన్నాడని, ఈ మ్యాచ్లో ఆడుతున్నాడని చెప్పాడు. అలాగే లోకీ ఫెర్గూసన్ స్థానంలో జోసెఫ్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. అదే సమయంలో తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ తెలిపాడు.
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మెకాయ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్
🚨 Toss Update 🚨@hardikpandya7 has won the toss & @gujarat_titans have elected to bowl against @rajasthanroyals.
Follow the match ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/vU3rmlVXRP
— IndianPremierLeague (@IPL) May 24, 2022