ఆరంభం అదిరిపోయిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్ తడబడింది. ప్రారంభంలో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5), జానీ బెయిర్స్టో (8) నిరాశపరిచారు. అయితే శిఖర్ ధవన్ (35), లియామ్ లివింగ్స్టన్ (64) అదరగొట్టారు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ (23), షారుఖ్ ఖాన్ (15) కూడా భారీ షాట్లు ఆడారు. అయితే ఒడియన్ స్మిత్ (0), కగిసో రబాడ (1), వైభవ్ అరోరా (2) బ్యాటుతో ఏమీ చేయలేకపోయారు.
చివర్లో రాహుల్ చాహర్ (22 నాటౌట్), అర్షదీప్ సింగ్ (10 నాటౌట్) నిలబడటంతో పంజాబ్ జట్టు ఆలౌట్ ప్రమాదం తప్పించుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా కూడా ఎటాకింగ్ గేమ్ ఆడిన పంజాబ్ ఈజీగా 200 పైచిలుకు స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే రషీద్ ఖాన్, దర్షన్ నల్కడే బౌలింగ్ మాయతో నెమ్మదించింది.
చివరకు 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, దర్షన్ నల్కడే 2 వికెట్లు తీయగా.. షమీ, హార్దిక్ పాండ్యా, లోకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీసుకున్నారు.