పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ తీవ్రంగా తడబడుతోంది. పలు మ్యాచుల్లో గుజరాత్కు విజయాలు అందించిన రాహుల్ తెవాటియా (11), రషీద్ ఖాన్ (0) జోడీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చెయ్యలేకపోయింది. చివరి ఐదు ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడతారని అభిమానులంతా ఆశిస్తే.. ఇద్దరు వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు.
రబాడ వేసిన 17వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్కు యత్నించిన తెవాటియా.. షార్ట్ థర్డ్ మ్యాన్లో సందీప్ శర్మకు చిక్కాడు. మరుసటి బంతికే రషీద్ ఖాన్ కూడా రబాడ వేసిన బంతిని ఆడే క్రమంలో కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ జట్టు 112 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో భారీ షాట్లు ఆడేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆ జట్టు బలమైన స్కోరు చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.