పంజాబ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. పద్నాలుగో ఓవర్ తొలి బంతికే యువ కీపర్ జితేష్ శర్మ (23) అవుటయ్యాడు. ధవన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం పది బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో సత్తాచాటిన జితేష్.. తొలి మ్యాచ్ ఆడుతున్న నల్కండే బౌలింగ్లు శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
బంతి స్లోగా రావడంతో జితేష్ టైమింగ్ మిస్ అయ్యాడు. భారీ షాట్ ఆడే క్రమంలో గిల్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికే విండీస్ ప్లేయర్ ఒడియన్ స్మిత్ (0) గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. నల్కండే వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. దాన్ని సరిగా అంచనా వేయకపోవడంతో బంతి గాల్లో బాగా ఎత్తుకు లేచింది. ఈ క్యాచ్ కూడా గిల్ అందుకున్నాడు. దాంతో స్మిత్ పెవిలియన్ బాటపట్టాడు. రెండు కీలక వికెట్లను వెంటవెంటనే కోల్పోయిన పంజాబ్ జట్టు ఏ మాత్రం స్కోరు చేస్తుందో చూడాలి.