పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు తడబడింది. ఆరంభంలో సాహా, గిల్ బౌండరీలు బాదారు. కానీ లేని పరుగు కోసం ప్రయత్నించిన గిల్ను.. తన సూపర్ ఫీల్డింగ్తో రిషి ధావన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే సాహా (21) కూడా రబాడ బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి గుజరాత్ జట్టు 42/2 స్కోరుతో నిలిచింది.
అయితే ఆ తర్వాత రిషి ధావన్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికే గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) అవుటయ్యాడు. ధావన్ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి పాండ్యా ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని.. కీపర్ జితేష్ శర్మ అందుకోవడంతో పాండ్యా ఇన్నింగ్స్ ముగిసింది.