పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్కు శుభారంభం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్కు సాహా, గిల్ ధీటైన ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సందీప్ శర్మ వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్ వైపు కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు గిల్.
కానీ రిషి ధావన్ అద్భుతమైన ఫీల్డింగ్తోపాటు డైరెక్ట్ హిట్తో రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది గుజరాత్. ప్రస్తుతం క్రీజులో సాహా, సాయి సుదర్శన్ ఉన్నారు.