పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రెండో వికెట్ కోల్పోయారు. ధాటిగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహా (21) అవుటయ్యాడు. అంతకుముందు అనవసర పరుగు కోసం ప్రయత్నించి గిల్ (9) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రబాడ బౌలింగ్లో సిక్సర్ బాదిన సాహా.. మరుసటి బంతికే అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
దీంతో గుజరాత జట్టు నాలుగు ఓవర్లలో 34 పరుగులకే రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. సాహా అవుటవడంతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు.