న్యూఢిల్లీ: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని రెజ్లర్లు నిరసన(Wrestlers Protest) చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేపడుతున్న రెజ్లర్లతో చర్చలు నిర్వహించేందుకు కేంద్రం మరోసారి సిద్ధమైంది. రెజ్లర్ల సమస్యలపై చర్చలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన తన ట్విట్టర్లో స్పందిస్తూ ఈ అంశంపై చర్చించేందుకు రెజ్లర్లను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. శనివారం రోజు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రితో మహిళా రెజ్లర్లు భేటీ అయిన విషయం తెలిసిందే.
The government is willing to have a discussion with the wrestlers on their issues.
I have once again invited the wrestlers for the same.
— Anurag Thakur (@ianuragthakur) June 6, 2023
మరో వైపు మంగళవారం రోజున బ్రిజ్ భూషణ్ ఇంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. యూపీలోని గోండాలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి దర్యాప్తు చేశారు. ఇంట్లో ఉన్నవారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దాదాపు 12 మందిని విచారించినట్లు తెలుస్తోంది. అయితే రైల్వే ఉద్యోగ విధుల్లో మళ్లీ చేరిన రెజ్లర్లు .. తమ పోరాటాన్ని కొనసాగించనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.