సూరత్ : లెజెం డ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అని నిందించాడని టీమ్ ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆరోపించాడు. బుధవారం ఇండియన్ కేపిటల్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్టు తెలిపాడు. వారిరువురూ ఒకరినొకరు దూషించుకుంటూ వివాదానికి దిగడంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గంభీర్ తనను ఫిక్సర్ అని దూషించగా, అతని మద్దతు దారులు గంభీర్ సిక్సర్ అన్నట్టు మాట మారుస్తున్నారన్నాడు. గంభీర్ గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతోనూ గొడవపడిన విషయాన్ని శ్రీశాంత్ గుర్తుచేశాడు.