న్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్.. గాయం నుంచి కోలుకొని మరింత బలంగా తిరిగొస్తాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. గతేడాది ఆఖర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో కుటుంబంతో కలిసి ఉన్న పంత్ను శుక్రవారం యువీ కలిశాడు. గతంలో క్యాన్సర్ నుంచి కోలుకొని జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన యువీ.. పంత్కు ధైర్యం చెప్పాడు.