గోల్డ్కోస్ట్: భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య గురువారం జరుగాల్సిన తొలి టీ20 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రైద్దెంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సమయంలో వర్షం ముంచెత్తడంతో ఆటను నిలిపివేశారు. వరుణుడు తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు పలు సమీక్షల అనంతరం ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్ధాంతరంగా ముగిసిన ఈ పోరులో జెమీమా రోడ్రిగ్స్ (49; 7 ఫోర్లు), షఫాలీ వర్మ (18) రాణించడంతో భారత్ మంచి స్కోరు దిశగా సాగింది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో టీ20 జరుగనుంది.