బ్రస్సెల్స్: ఆఫ్రికా జట్టు మొరాకో ఎలాంటి అంచనాలు లేకుండా ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో అడుగుపెట్టింది. హేమాహేమీలను ఓడించి సెమీఫైనల్ వరకు దూసుకొచ్చింది. అయితే బుధవారం జరిగిన సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ చేతిలో మట్టికరిచింది. దీంతో తమ జట్టు ఫైనల్కు చేరి కప్పు కొడుతుందనుకున్న మొరాకో అభిమానుల ఆశలు చెదిరిపోయాయి. ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం బ్రస్సెల్స్ వీధుల్లో వీరంగం సృష్టించారు.
మొరాకో జెండాలు చేతపట్టుకన్న సుమారు వంద మంది.. బ్రసెల్స్లోని సౌత్ స్టేషన్ సమీపంలో చెత్త డబ్బాలు, కార్డ్బోర్డులను తగలబెట్టారు. పోలీసులపైకి పటాకులు, ఇతర వస్తువులు విసిరేశారు. దీంతో పరిస్థితి సృతిమించకుండా ఉండేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వదిలారు. వాటర్ క్యానన్లతో ఆభిమానులను చెదరగొట్టారు.
బుధవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో మొరాకోపై 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఆధ్యంతం హోరాహోరాగా సాగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ జట్టులోని ఆటగాళ్ల ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో మొరాకో ఒక్కగోలు కూడా చేయకుండానే మ్యాచ్ను ముగించాల్సి వచ్చింది.