దోహా: ఫుట్బాల్ వరల్డ్కప్కు చెందిన క్వార్టర్స్ మ్యాచ్లు ఖారారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీన ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో బ్రెజిల్తో క్రొయేషియా జట్టు తలపడనున్నది. ఇక 10వ తేదీన అర్జెంటీనాతో నెదర్లాండ్స్, పోర్చుగల్తో మొరాక్కో జట్లు పోటీపడనున్నాయి. అర్జెంటీనా మ్యాచ్ లుసైల్ స్టేడియంలో జరగనుండగా, పోర్చుగల్ మ్యాచ్ అల్ తుమమ స్టేడియంలో జరగనున్నది. డిసెంబర్ 11వ తేదీన ఇంగ్లండ్తో ఫ్రాన్స్ ఢీకొననున్నది. క్వార్టర్స్లో ఇంగ్లండ్ వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. అర్జెంటీనా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్పైన కూడా జోరుగా బెట్టింగ్ సాగుతోంది. 14, 15వ తేదీల్లో సెమీస్లు జరుగుతాయి. ఇక వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18వ తేదీన నిర్వహించనున్నారు.