చెన్నై: ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్పై తమకు ఉన్న అభిమానాన్ని చెన్నైకి చెందిన అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తీక్ జెర్సీ నంబర్ 19 ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.
తమిళనాడు, ఆంధప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ర్టాల నుంచి దాదాపు 3 వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు ఆసియా బుక్లో చోటు లభించింది.