ఢిల్లీ: సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. హైదరాబాద్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు. ఓపెనర్లు దూకుడుగా ఆడుతుండటంతో పవర్ప్లే ఆఖరికి చెన్నై 50/0తో నిలిచింది. 8 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ప్రస్తుతం డుప్లెసిస్(35), గైక్వాడ్(31) అర్ధశతకాలు సాధించే దిశగా సాగుతున్నారు.