భువనేశ్వర్ : భారత హాకీ మహిళా జట్టు మిడ్ఫీల్డర్ నమిత టొప్పొ గురువారం తన కెరీర్కు గుడ్బై చెప్పింది. 2012లో అరంగేట్రం చేసిన తరువాత నమిత భారత్ తరఫున 168 అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రాతినిథ్యం వహించింది. 2007లో జూనియర్ స్థాయిలో అరంగేట్రం చేసిన నమిత 2011లో ఆసియాకప్లో పాల్గొన్నది. ఆ టోర్నీలో భారత జట్టు కాంస్యం గెలిచింది. అనంతరం సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి పలు అంతర్జాతీయ మ్యాచ్లలో పాల్గొన్నది.