IPL Auction 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం తెరలేవడానికి కొన్ని గంటల ముందే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రిహాన్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ యువ స్పిన్నర్ వేలం నుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ కమిట్మెంట్స్తో పాటు వ్యక్తిగత కారణాల రీత్యా రిహాన్.. వేలం నుంచి తప్పుకున్నట్టు సమాచారం. రిహాన్తో పాటు మరికొంతమంది స్టార్ ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా ప్లేఆఫ్స్ తర్వాత ఆడేది అనుమానంగానే ఉంది. రిహాన్తో పాటు బంగ్లాదేశ్ క్రికెటర్లు టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం కూడా వేలం నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం.
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే జోస్ బట్లర్, పంజాబ్కు ఆడే లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్ స్టో, సామ్ కరన్లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతున్న మార్క్వుడ్ కూడా లీగ్ స్టేజ్ వరకే అందుబాటులో ఉంటారని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లండ్ ప్లేయర్లంతా ప్లేఆఫ్స్కు ముందే లండన్ విమానం ఎక్కుతారని తెలుస్తున్నది.
Players who withdraw from auction
-Rehan Ahmed -England
-Taskin,Shoriful – Bangladesh#iplauction2024 #IPLAuction #Babar #RIPMumbaiIndians #Ashwin #JioCinema #CricketTwitter #RohitSharma pic.twitter.com/HfK0iwJIpX— Sujeet Suman (@sujeetsuman1991) December 18, 2023
ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్తో మే 22 నుంచి టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోనప్పటికీ దాదాపు అదే టైమ్లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఉండే అవకాశముంది. ఐపీఎల్ తో సంబంధం లేకుండా ఇంగ్లండ్ ప్లేయర్లు మే మూడోవారంలోనే స్వదేశానికి వెళ్లే అవకాశముంది. ఈ షరతు మీదే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్ ఆడేందుకు అంగీకారం తెలిపిందని తెలుస్తున్నది. ఇదే సమాచారాన్ని బీసీసీఐ ఫ్రాంచైజీలకు చేరవేసింది.