న్యూఢిల్లీ, జనవరి 6: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త మాడల్ను మార్కెట్కు పరిచయం చేసింది. ఈ రంగంలోకి అడుగుపెట్టి పదేండ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక ఎడిషన్గా 450 అపెక్స్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1.89 లక్షల ధర కలిగిన ఈ స్కూటర్ కోసం ముందస్తు బుకింగ్లు ప్రారంభించినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు.
కేవలం 2.9 సెకండ్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ను గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 200 సీసీ సామర్థ్యంతో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ పూర్తి స్థాయి బ్యాటరీ చార్జింగ్తో 157 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ స్కూటర్పై ఐదేండ్లు లేదా 60 వేల కిలోమీటర్ల బ్యాటరీ వ్యారెంటీ కూడా సంస్థ కల్పిస్తున్నది.