దోహా : ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ఖతార్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నది. స్వియాటెక్ ఫైనల్లో 6-3, 6-0తో అమెరికాకు చెందిన జెస్సికా పెగ్యులాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లలో స్వియాటెక్ కేవలం అయిదు గేమ్లను మాత్రమే కోల్పోయింది. ఆరంభ రౌండ్లలో 6-0, 6-1తో వరుసగా డేనియెల్ల కొలిన్స్, వెరోనిక కుదెర్మెతోవపై గెలుపొందిన స్వియాటెక్ క్వార్టర్ఫైనల్లో బై లభించింది. ఈ యేడాది స్వియాటెక్ దక్కించుకున్న తొలి టైటిల్ ఇది. మొత్తంగా 12వ డబ్ల్యూటీఏ టైటిల్.