న్యూఢిల్లీ: పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ(Hasan Ali).. ఇండియన్ అమ్మాయిని పెళ్లాడాడు. హర్యానాకు చెందిన ఇంజినీర్ సమియా ఆర్జూను అతను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరి రొమాన్స్ వెనుక ఒక కథ ఉంది. ఇద్దరికి తెలిసిన స్నేహితుల ద్వారా వాళ్లు ఒక్కటయ్యారు. రెండేళ్లు రిలేషన్లో ఉన్న ఆ జంట ఆ తర్వాత పెళ్లి చేసుకున్నది. ఆ జంటకు ఓ అమ్మాయి కూడా పుట్టింది. అయితే ఇండియాలో వరల్డ్కప్ జరుగుతున్న నేపథ్యంలో ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషకర విషయం చోటుచేసుకున్నది. సమియా తండ్రి లియాకత్ ఖాన్ తొలిసారి తన మనవరాల్ని కలుసుకోన్నాడు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సమియా జన్మించింది. ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో ఆమెకు బీటెక్ డిగ్రీ ఉంది. తొలుత జెట్ ఎయిర్వేస్లో హెయిర్ హోస్టెస్గా చేసింది. ఆ తర్వాత ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఫ్లయిట్ ఇంజినీర్గా చేరింది. 2019లో సమియా, హసన్ అలీ మధ్య పరిచయమైంది. 2021లో ఆ జంటకు ఓ బేబీ పుట్టింది.. సమియా దుబాయ్లోనే ఉంటుంది. కానీ ఆమె పేరంట్స్ మాత్రం గూర్గావ్లో ఉంటున్నారు.