బెంగళూరు: ప్రధాన ఆటగాళ్లు రాణించడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై మంచి స్కోరు దిశగా పయనిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. బుధవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (78) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ పృథ్వీ షా (47), సర్ఫరాజ్ (40 బ్యాటింగ్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్, సారాంశ్ జైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఓవరాల్గా తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి ఇరు జట్ల సమంగా నిలిచాయి. పృథ్వీ, జైస్వాల్ తొలి వికెట్కు 87 పరుగులు జోడించి శుభారంభం ఇవ్వగా.. అర్మాన్ జాఫర్ (26), సువెద్ (18), హార్దిక్ తమోరె (24) ఎక్కువసేపు నిలువలేకపోయారు. తన కెరీర్లోనే భీకర ఫామ్లో ఉన్న సర్ఫరాజ్తో పాటు షమ్స్ (12) క్రీజులో ఉన్నాడు.