న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్కు ముందు భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు యువ అథ్లెట్లు ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారు. దీంతో మెగాటోర్నీకి ఎంపికైన 37 మందితో కూడిన భారత జట్టు నుంచి వీరికి ఉద్వాసన ఎదురైంది. గత నెలలో ధనలక్ష్మి, ఐశ్వర్య నుంచి సేకరించిన శాంపిల్స్పై రెండు దఫాలుగా జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.
ధనలక్ష్మి నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకం ఒస్టారైన్ ఉన్నట్లు తేలింది. ‘అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్తో (ఏఐయు) పాటు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(ఎన్ఏడీఏ) నిర్వహించిన రెండు పరీక్షల్లో ధనలక్ష్మి విఫలమైంది. ఈ కారణం వల్ల ఆమె జాతీయ జట్టుతో కలిసి కామన్వెల్త్కు వెళ్లడం లేదు’ అని జాతీయ అథ్లెటిక్స్ వర్గాలు పేర్కొన్నాయి.