బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పతక క్రీడగా ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ స్వర్ణం దక్కించుకోవాలనుకున్న భారత జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో మన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చినా.. చివరకు ఒత్తిడికి గురైన 9 పరుగుల తేడాతో ఓడిపోయారు. తొలుత ఆస్ట్రేలియా 8 వికెట్లకు 161 పరుగులు చేయగా సమాధానంగా భారత్ మూడు బంతులు మిగిలి ఉండగా 152 పరుగులకు ఆలౌటైంది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ మ్యాచ్లో అత్యధికంగా 65 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయింది. కాగా అంతకుముందు జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఇంగ్లండ్ను ఓడించి కాంస్య పతకం దక్కించుకుంది. ఓపెనర్లిరువురినీ త్వరగానే కోల్పోయినా హర్మన్ప్రీత్ (65), జెమీమా రోడ్రిగ్స్ (33) మూడో వికెట్కు 96 పరుగులు జోడించి ఆశలు కల్పించారు. వారిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు విజయం మనదే అనిపించింది. అయితే ఇరువురూ వరుస ఓవర్లలో అవుటవడంతో విజయావకాశాలు సన్నగిల్లాయి.