ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మెయిడెన్ ఓవర్ వేయగా.. రెండు ఓవర్లు వేసిన లలిత్ యాదవ్ కేవలం ఆరు పరుగులే ఇవ్వడం గమనార్హం.
రాజస్థాన్ బ్యాటర్లు ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించారు. అయితే ఆ తర్వాత జోరు పెంచారు. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో పడిక్కల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత మళ్లీ పవర్ప్లే చివరి ఓవర్లో బట్లర్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 44 పరుగులు చేసింది.