ఢిల్లీ క్యాపిటల్స్కు మరో షాక్. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ పృథ్వీ షా (37) అవుటయ్యాడు. అశ్విన్ వేసిన పదో ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో షా వెనుతిరిగాడు. అశ్విన్ వేసిన షార్ట్ బాల్ను బౌండరీకి తరలించేందుకు షా ప్రయత్నించాడు. అయితే బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని అందుకున్నాడు. దాంతో షా ఇన్నింగ్స్ ముగిసింది.
దీంతో పది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు రెండు మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 124 పరుగులు అవసరం ఉన్నాయి. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.