పుణె: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్ దబాంగ్ ఢిల్లీ జట్టు దుమ్మురేపుతున్నది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 11-4తో యు ముంబాపై ఘన విజయం సాధించింది. లీగ్లో రెండో గెలుపు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ ప్రస్తుతం 33 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్లో రాష్ట్ర యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ 11-8, 11-9, 11-8తో దియా చితాలేపై అద్భుత విజయం సాధించింది. మిగతా మ్యాచ్ల్లో జోన్ పర్సన్ 3-0తో మానవ్ థక్కర్పై, ఐహికా ముఖర్జీ 2-1తో లిల్లీ జాంగ్పై, సాతియాన్, బార్బోరా జోడీ 2-1తో మానవ్, లిల్లీపై గెలువగా, సాతియాన్ 1-2తో క్యాడ్రీ చేతిలో ఓడాడు.