చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఛేజింగ్ను సన్రైజర్స్ జట్టు అద్భుతంగా ఆరంభించింది. ఓపెనర్లు విలియమ్సన్ (10 నాటౌట్) యాంకర్ పాత్ర పోషించగా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (27 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 15 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ఈ జోడీని విడగొట్టేందుకు చెన్నై బౌలర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ముకేష్ చౌదరి వేసిన బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించిన అభిషేక్ క్యాచ్ ఇచ్చాడు.
దాన్ని పట్టుకోవడానికి శివమ్ దూబే పరిగెత్తుకుంటూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. అతనికి అడుగు దూరంలో బంతి నేలను తాకింది. దాంతో బతికిపోయిన అభిషేక్ ఆ తర్వాత చూడచక్కని షాట్లు ఆడుతూ ఛేజ్ను ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి సన్రైజర్స్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 37 పరుగులు చేసింది.