సన్రైజర్స్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో సారి సత్తా చాటాడు. 14వ ఓవర్ మూడో బంతికి అంబటి రాయుడు (27)ను అవుట్ చేశాడు. సుందర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు రాయుడు ప్రయత్నించాడు. కానీ ప్లేస్మెంట్ సరిగా కుదరకపోవడంతో దాన్ని బౌండరీ దాటించడంలో రాయుడు విఫలమయ్యాడు.
లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న ఎయిడెన్ మార్క్రమ్ క్యాచ్ పట్టేసి రాయుడును వెనక్కు పంపాడు. ఈ మ్యాచ్లో సుందర్కు ఇది రెండో వికెట్. అంతకుముందు రాబిన్ ఊతప్ప (15)ను కూడా ఇలాగే అవుట్ చేశాడు. ఆ తర్వాత 15వ ఓవర్లో బంతి అందుకున్న మార్క్రమ్.. మొయీన్ అలీ (48)ని పెవిలియన్ చేర్చాడు.
ఆ ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన అలీ.. ఆ తర్వాతి బంతికి మరో భారీ షాట్ ఆడే క్రమంలో లాంగాన్ వద్ద రాహుల్ త్రిపాఠీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.