ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా బుధవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం(చేపాక్ స్టేడియం) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది.
ఐపీఎల్ – 16లో జరిగే మ్యాచ్లలో ఈ మధ్య అన్నీ ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లలో ఫలితాలు తేలుతున్న పరంపరను బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్తాన్ రాయల్స్ జట్లు కొనసాగించాయి. చివరి బంతి వరకూ ఫలితం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. రాజస్తాన్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై.. ఒక దశలో 113కే 6 వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో రవీంద్ర జడేజా, వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు), ధోని (17 బంతుల్లో 32 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) చేసిన ప్రయత్నాలని సందీప్ శర్మ తెలివిగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని దూరం చేశాడు.
స్పిన్ కు అనుకూలించిన చెపాక్ పిచ్ పై 175 పరుగులను రాజస్థాన్ డిఫెండ్ చేసుకుంది. స్పిన్నర్ల త్రయం అశ్విన్, చాహల్, జంపాలు చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ ముగ్గురి స్పిన్ ఉచ్చులో పడ్డ చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాజస్తాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
176 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8) ను సందీప్ శర్మ ఔట్ చేశాడు. గత మ్యాచ్ లో ముంబైపై సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే (19 బంతుల్లో 31, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి డెవాన్ కాన్వే (38 బంతుల్లో 50, 6 ఫోర్లు) లు చెన్నైని ముందుకు నడిపించారు. రహానే – కాన్వేలు మరీ ధాటిగా ఆడకపోయినా రన్ రేట్ 7 కు తగ్గకుండా జాగ్రత్తపడ్డారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు సాధించింది. రాజస్థాన్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 52 పరుగులు (36 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్లు) అత్యధిక పరుగులు చేశాడు. దేవ్దత్ పడిక్కల్ (38 పరుగులు, 26 బంతుల్లో, 5 ఫోర్లు) కూడా బ్యాట్ ఝుళింపించాడు. రవిచంద్రన్ అశ్విన్ 30 పరుగులు (22 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్లు) చేశాడు. చివర్లో హేట్మేయర్ (30 పరుగులు, 18 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గౌరవప్రదమైన 175 స్కోరు దక్కింది.
చెన్నై బౌలర్లలో రవీంద్రా జడేజా 2, ఆకాష్ సింగ్ 2, తుషార్ దేశ్పాండ్ 2 వికెట్లు తీశారు. స్పిన్నర్ మొయిన్ అలీ 1 వికెట్ పడగొట్టారు.