ఐపీఎల్లో చెన్నై పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో కూడా చెన్నై ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టులో లియామ్ లివింగ్స్టన్ (60), ధవన్ (33), జితేష్ శర్మ (26) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై జట్టు ఆరంభం నుంచే తడబడుతూ వచ్చింది.
ఫామ్ లేమితో నానా తంటాలు పడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (1) రెండో ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రాబిన్ ఊతప్ప (13) పెవిలియన్ చేరాడు. కీలకమైన మొయీన్ అలీ (0), రవీంద్ర జడేజా (0) ఇద్దరూ డకౌట్లుగా వెనుతిరిగారు. ఇళాంటి సమయంలో శివమ్ దూబే (57) జట్టును ఆదుకున్నాడు. ధోనీ (23) అండగా నిలబడటంతో రెచ్చిపోయి ఆడిన అతను.. చెన్నైకి విజయాన్ని అందించేలా కనిపించాడు.
కానీ లివింగస్టోన్ బౌలింగ్లో బంతిని సరిగా అంచనా వేయలేక అర్షదీప్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వాతి బంతికే డ్వేన్ బ్రావో (0) గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. చివర్లో టెయిలెండర్లు అండగా ధోనీ రెచ్చిపోతాడని అభిమానులు ఆశించారు. ధోనీ కూడా గేరు మార్చి భారీ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. కానీ చాహర్ లెగ్ సైడ్ వేసిన వైడ్ బంతిని పుల్ చేసే క్రమంలో కీపర్ జితేష్కు చిక్కాడు.
అంపైర్ నాటౌట్ ఇచ్చినా కూడా జితేష్ పట్టుబట్టి మయాంక్ రివ్యూ తీసుకునేలా చేశాడు. రివ్యూలో బంతి ధోనీ బ్యాటును లైట్గా తాకినట్లు తేలడంతో ధోనీ కూడా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి క్రిస్ జోర్డాన్ (5) చివరి వికెట్ రూపంలో వెనుతిరగడంతో చెన్నై కథ ముగిసింది. పూర్తి ఓవర్లు కూడా ఆడని చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది.
పంజాబ్ బౌలర్లలో కొత్త కుర్రాడు వైభవ్ అరోరా 2, లియామ్ లివింగ్స్టన్ 2 వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కగిసో రబాడ, అర్షదీప్ సింగ్, ఒడియన్ స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు. ఆడిన మూడు మ్యాచుల్లో ఇది పంజాబ్కు రెండో విజయం కాగా.. చెన్నైకు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
2⃣ more points in the bag for @PunjabKingsIPL! 👌 👌
A fantastic performance from the @mayankcricket-led unit as they beat #CSK by 5⃣4⃣ runs to seal their second win of the #TATAIPL 2022. 👏 👏 #CSKvPBKS
Scorecard ▶️ https://t.co/ZgMGLamhfU pic.twitter.com/TU4lEoVG7D
— IndianPremierLeague (@IPL) April 3, 2022