తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజపక్స (5) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు పని అయిపోయిందని అభిమానులు అనుకున్నారు. అయితే మెగావేలంలో భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టోన్ (38 నాటౌట్) దొరికిన బంతిని దొరికినట్లే బాదేశాడు.
దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది. అతనికి ధవన్ (17 నాటౌట్) అండగా నిలిచి మరో వికెట్ పడనీయలేదు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ జట్టు 72/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. చెన్నై బౌలర్లలో యువపేసర్ ముకేష్ ఒక వికెట్ తీయగా.. ధోనీ సూపర్ స్టంపింగ్కు రాజపక్స అవుటయ్యాడు.