చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతున్న శుభ్మన్ గిల్ (18) పెవిలియన్ చేరాడు. అరంగేట్ర ఆటగాడు పతిరాణా వేసినత తొలి బంతికే గిల్ అవుటయ్యాడు. పతిరాణా వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. సరిగా అంచనా వేయలేకపోయాడు.
దీంతో బంతి అతని ప్యాడ్లను తాకింది. పతిరాణా అప్పీల్ చేయగానే అంపైర్ అవుటిచ్చాడు. గిల్ రివ్యూ కోరాడు. రివ్యూలో కూడా అతను అవుటనే తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఐపీఎల్లో తను వేసిన తొలి బంతికే పతిరాణాకు వికెట్ దక్కడం గమనార్హం.