చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన శ్రీకర్ భరత్ (8) పెవిలియన్ చేరాడు. సిమర్జీత్ సింగ్ వేసిన రెండో ఓవర్ తొలి రెండు బంతులను బౌండరీలకు పంపిన అతను.. ఐదో బంతికి అవుటయ్యాడు. సిమర్జీత్ వేసిన లెంగ్త్ బాల్ను పుల్ చేయడానికి భరత్ ప్రయత్నించాడు.
ఈ క్రమంల్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్లో ఉన్న మొయీన్ అలీ వైపు వెళ్లింది. దాన్ని అతను చక్కగా అందుకోవడంతో భరత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఐపీఎల్లో అతనికి ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.