Matheesha Pathirana : ఐపీఎల్(IPL) అనేది ఎంటర్టైనింగ్ క్రికెట్ మాత్రమే కాదు కుర్రాళ్ల కలను నిజం చేసే వేదిక కూడా. ఈ టోర్నీలో అదరగొడితే చాలు జాతీయ జట్టులో ఆడే అవకాశం వెతుక్కుంటూ మరీ వస్తుంది. అవును.. సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్.. వీళ్లంతా టీమిండియాలోకి అలా వచ్చిన వాళ్లే.. ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ మథీశ పథిరన(Matheesha Pathirana) వంతు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 16వ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన అతడు వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఈ యంగ్ పేసర్ ఈరోజు ఆఫ్గనిస్థాన్పై వన్డేల్లో ఆరంగేట్రం చేయనున్నాడు.
పథిరన బౌలింగ్ యాక్షన్ అచ్చుగుద్దినట్టు తమదేశానికి చెందిన మాజీ పేసర్ లసిత్ మలింగ(Lasith Malinga) లెక్క ఉంటుంది. ఇరవై ఏళ్ల ఈ శ్రీలంక బౌలర్ ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేశాడు. 12 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరొందిన అతను కచ్చితమైన యార్కర్లు సంధించేవాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సలహాలతో అతను విజయవంతం అయ్యాడు. యంగ్స్టర్లు తుషార్ దేశ్పాండే, థీక్షణ(శ్రీలంక)తో కలిసి సీఎస్కే విజయాల్లో పథిరన కీలక పాత్ర పోషించాడు.
🎉🏏 Exciting moment for Matheesha Pathirana as he receives his One Day International cap from skipper Dasun Shanaka! 🙌#SLvAFG pic.twitter.com/2EaBAXYwzC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 2, 2023
చెన్నై జట్టు ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. దాంతో, ఐదో ఐపీఎల్ ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. అంతేకాదు అత్యధిక టైటిళ్లతో ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు రవీంద్ర జడేజా(15 నాటౌట్) సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. పరుగెత్తుతూ వెళ్లి డగౌట్లో ఉన్న కెప్టెన్ ఎంఎస్ ధోనీని కౌగిలించుకున్నాడు. ధోనీ అతడిని అమాంతం ఎత్తుకుని అభినందించాడు.