లిస్బన్: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డు సృష్టించాడు. 30 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి వ్యక్తిగా నిలిచాడు. గతంలో ఇదే ఇన్స్టాలో 20 కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా కూడా రొనాల్డో నిలవడం విశేషం. ఈ మధ్యే యూరో 2020లో భాగంగా హంగరీతో మ్యాచ్లో రెండు గోల్స్ చేసి టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్లోనూ తిరుగు లేదని నిరూపించాడు. శుక్రవారం ఈ అరుదైన 30 కోట్ల ఫాలోవర్ల రికార్డును రొనాల్డో అందుకున్నాడు.
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల లిస్ట్లో రొనాల్డో తర్వాత రెజ్లర్ డ్వేన్ ద రాక్ జాన్సన్, మ్యుజీషియన్ అరియానా గ్రాండె, కైలీ జెన్నర్, సెలీనా గోమెజ్ ఉన్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్లో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి ఇన్స్టాలో 12.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని తర్వాత ప్రియాంకా చోప్రాకు 6.45 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.