ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ విజేత ఎవరో మరో రెండు రోజుల్లో తెలియనుంది. నవంబర్ 13న మెల్బోర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. దాంతో, ఈ ఏడాది ప్లేయర్ ఆఫ్ ది టీ 20 వరల్డ్ కప్ 2022 అవార్డుని ఎవరు అందుకుంటారనే ఆసక్తి అందరిలోనెలకొంది. ఈ అవార్డ్ కోసం టోర్నమెంట్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 9 మంది ఆటగాళ్ల పేర్లతో కూడిన జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో భారతజట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ టీమ్ నుంచి షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రీది చోటు దక్కించుకున్నారు.ఇంగ్లాండ్ జట్టు నుంచి అత్యధికంగా ముగ్గురు ప్లేయర్ ది టీ 2022 అవార్డు రేసులో ఉన్నారు. జోస్ బట్లర్, సామ్ కర్రన్, అలెక్స్ హేల్స్ను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రజా, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు టీమిండియాను ఓడించింది. ఈసారి ఫైనల్లో ఏ జట్టు గెలిచినా టీ 20 వరల్డ్ కప్ని రెండు సార్లు సాధించిన రెండో జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. పాకిస్థాన్ 2009లో, ఇంగ్లాండ్ 2010లో పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచాయి. పొట్టి ప్రపంచకప్ని రెండుసార్లు (2012, 2016) గెలిచిన మొదటి జట్టు రికార్డు వెస్టిండీస్ పేరున ఉంది.