Sumit Nagal | చెన్నై: ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నాగల్.. చెన్నై ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ నాగల్ 6-3, 6-4తో డాలిబర్ (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన పోరులో నాగల్ వరుస సెట్లలో విజృంభించాడు. ఆదివారం జరగనున్న తుదిపోరులో టాప్ సీడ్ లూకా నార్డీ (ఇటలీ)తో నాగల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.