చెన్నై: చెన్నై గ్రాండ్మాస్టర్ చెస్ చాంపియన్షిప్లో దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన టైబ్రేక్ పోరులో గుకేశ్..తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్పై విజయం సాధించాడు. మొత్తం ఏడు రౌండ్లు ముగిసే సరికి గుకేశ్, అర్జున్ 4.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు.
ఏడో రౌండ్ పోరులో హరికృష్ణతో గేమ్ను గుకేశ్ డ్రా చేసుకోగా, సుగ్రోవ్(హంగరీ)పై అర్జున్ విజయం సాధించాడు. చెన్నై టైటిల్ విజయం ద్వారా..ఉజ్బెకిస్థాన్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత అవకాశాలను గుకేశ్ మెరుగుపర్చుకున్నాడు.