రాజ్కోట్: ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడవ టెస్టు నుంచి స్పినర్ అశ్విన్(Ravichandran Ashwin) అకస్మాత్తుగా తప్పుకున్నాడు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేని కారణంగా.. అతను హుటాహుటిన చెన్నై వెళ్లాడు. రెండవ రోజున అశ్విన్ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్న రెండవ భారత బౌలర్గా నిలిచాడతను. అయితే ఆ రెండవ రోజు ఆట ముగిశాక, మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అశ్విన్ చెన్నై పయనమైనట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
అశ్విన్ లేకపోవడంతో ఇప్పుడు ఇండియా వద్ద కేవలం నలుగురు మాత్రమే ఫుల్టైం బౌలర్లు ఉండిపోయారు. అయితే అశ్విన్ స్థానంలో కొత్త బౌలర్ను తీసుకునే ఛాన్స్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెరిలీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) రూల్స్ ప్రకారం.. అశ్విన్ స్థానంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను తీసుకునేందుకు అంపైర్లు అవకాశం కల్పిస్తారు. ప్లేయర్ గాయపడ్డా లేక అస్వస్థతకు గురైనా అప్పుడు ఆ అవకాశం ఇస్తారు. ఎంసీసీ రూల్ నెంబర్ 24.1.1.2 ప్రకారం కూడా సబ్స్టిట్యూట్ ఆటగాడిని తీసుకునే ఛాన్సు ఉంది.
కానీ ఈ మ్యాచ్లో అశ్విన్ గాయపడలేదు, అస్వస్థతకు లోనుకాలేదు. అందు వల్ల అశ్విన్ స్థానంలో రాజ్కోట్ టెస్టు కోసం కేవలం సబ్స్టిట్యూట్ ఫీల్డర్కు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. అది కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అనుమతితోనే జరుగుతుంది. సబ్స్టిట్యూట్ ఫీల్డర్కు బ్యాలింగ్ కానీ బౌలింగ్ కానీ చేసే అవకాశం ఉండదు. కేవలం కాంకషన్ సబ్స్టిట్యూట్ ఆటగాళ్లకు మాత్రమే బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది
ఇండియా తొలి ఇన్నింగ్స్లో 445 రన్స్ ఆలౌట్గా కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది.