బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. ఆఖరి పోరులో ప్రపంచ నంబర్వన్, ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై ఘన విజయం సాధించాడు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్లో ప్రణయ్ 14-21, 21-17, 21-18తో అక్సెల్సన్కు షాకిచ్చాడు. ప్రపంచ నంబర్వన్పై నెగ్గినా.. ప్రణయ్కు నిరాశ తప్పలేదు. గత రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలవడంతో ప్రణయ్.. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.