హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ మరోమారు సత్తాచాటాడు. రోటర్డామ్(నెదర్లాండ్స్) వేదికగా జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన కానిస్టేబుల్ దుద్యాల గోపాల కృష్ణయ్య కాంస్య పతకంతో మెరిశాడు.
శనివారం జరిగిన పురుషుల తైక్వాండో 80కిలోల విభాగంలో జయకేతనం ఎగరవేశాడు. ప్రస్తుతం విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గోపాల కృష్ణయ్యను డీజీ అంజినీ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పోలీస్ సత్తాకు ఇది నిదర్శనమని అన్నారు.