హైదరాబాద్, ఆట ప్రతినిధి: బాలీ(ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో హైదరాబాదీ యువ ప్లేయర్ సంహిత పుంగవనం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం ఏడు రౌండ్ల పాటు జరిగిన పోరులో 6.5 పాయింట్లతో సంహిత కాంస్య పతకంతో మెరిసింది.
ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసిరిన సంహిత మెరుగైన ఆటతీరు కనబరిచింది. వ్యక్తిగత విభాగంలోనే కాకుండా టీమ్ చాంపియన్షిప్ మూడు విభాగా(స్టాండర్డ్, ర్యాపిడ్, బ్లిట్జ్)ల్లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకోవడంలో ఈ యువ ప్లేయర్ కీలక పాత్రపోషించింది. చార్వి, పూజశ్రీతో కలిసి సంహిత ఈ ఫీట్ అందుకుంది.