లండన్: గత ఏడాది నవంబర్లో జరిగిన టీ20 వరల్డ్కప్(T20 Worldcup)ను ఇంగ్లండ్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఆ జట్టు పాకిస్థాన్ను ఓడించింది. అయితే వరల్డ్కప్ గెలిచిన క్రికెట్ జట్టు ఇటీవల ఆ దేశ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)ను కలిసింది. ప్రధాని అధికార నివాసం డౌనింగ్స్ట్రీట్కు.. కొంత మంది క్రికెటర్లు వెళ్లారు. ఈ నేపథ్యంలో రుషి సునాక్ కాసేపు బ్యాటింగ్ చేశారు. సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో రుషి సునాక్ కొన్ని భారీ షాట్లు కొట్టారు. ఆ తర్వాత బౌలింగ్ కూడా చేశారు. వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యులతో ప్రధాని రిషి గ్రూపు ఫోటోలు దిగారు.
Prime Minister @RishiSunak playing cricket with the #T20 World Cup winning cricket team at 10 Downing Street. pic.twitter.com/Bqh57dVZce
— Luca Boffa (@luca_boffa) March 22, 2023