బ్యాంకాక్: బాక్సింగ్ ప్రపంచ క్వాలిఫయర్స్లో భారత యువ బాక్సర్ నిషాంత్ దేవ్ రెండో రౌండ్ను రెండంటే రెండే నిమిషాల్లోనే పూర్తిచేసి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన 71 కిలోల రెండో రౌండ్ పోరులో నిషాంత్.. ఆట మొదలవగానే మంగోలియా బాక్సర్ బయంబ ఎర్డెనెటొపై పవర్ఫుల్ పంచ్లతో దాడికి దిగాడు.
నిషాంత్ పంచ్లకు తాళలేకపోయిన ఎర్డెనెటొ.. రిఫరీ స్టాప్ ది కాంటెస్ట్ (ఆర్ఎస్సీ)తో రింగ్ను వీడటంతో భారత బాక్సర్ విజేతగా నిలిచి ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించాడు. మరో మ్యాచ్లో అవినాశ్ జమ్వల్ (63.5 కిలోలు).. కొలంబియా బాక్సర్ జోస్ మాన్యూల్ చేతిలో ఓడి తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. 57కిలోల కేటగిరీలో సచిన్ సివాచ్ 5-0తో ఫ్రెడ్రిక్ జెన్సన్(డెన్మార్క్)పై గెలిచి టోర్నీలో ముందంజ వేశాడు.